దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు తాజాగా తన కుటుంబంతో కలిసి చిన్న విరామాన్ని ఎంజాయ్ చేయడానికి బయలుదేరారు.
మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో కనిపించారు. కుటుంబ సమేతంగా వెకేషన్కు వెళ్తున్న వారి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకున్నట్లు స్పష్టమైంది. సమాచారం ప్రకారం, ఆయన జూలై 1, 2026 నాటికి తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, ‘వారణాసి’లో మహేష్ బాబు పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కనుల విందుగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, మహేష్ బాబు ‘రుద్ర’ మరియు ‘శ్రీరాముడు’ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సుమారు రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మిస్తుండగా, ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది.
ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47…
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'శ్రీ శ్రీ'పై…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కీలక మైలురాయిని అందుకుంది. రెండో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా…
కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న థియేటర్లలో విడుదలైంది.…
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్లు' ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్…
జీ5 ఒరిజినల్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్ చాప్టర్ 1' ట్రైలర్ ఆకట్టుకునే కోర్ట్రూమ్ థ్రిల్లర్గా…