స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ మహిళా ప్రాధాన్య చిత్రం సమంత కెరీర్లో మరో విజయంగా నిలిచింది.
ఈ సినిమా విజయంతో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తుండగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా స్పందించారు. చిత్ర యూనిట్ను అభినందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
చిరంజీవి మాట్లాడుతూ, సమంత లాంటి స్టార్ హీరోయిన్ యాక్షన్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషమని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి వైవిధ్యభరితమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, క్రియేటర్ మరియు నిర్మాత రాజ్ నిడిమోరు సహా మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం చిరంజీవి చేసిన మరో వ్యాఖ్య. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమంత-రాజ్లకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల సమంత బేబీ బంప్తో కనిపించారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో, ఆమె గర్భవతి అనే ప్రచారం జోరందుకుంది. అలాగే సమంత-రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సమంత లేదా రాజ్ నిడిమోరు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత మరోసారి తన స్టార్డమ్ను నిరూపించుకోగా, సినిమా విజయోత్సాహంలో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47…
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'శ్రీ శ్రీ'పై…
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కీలక మైలురాయిని అందుకుంది. రెండో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా…
కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న థియేటర్లలో విడుదలైంది.…
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'వంద దేవుళ్లు' ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విజయ్…
జీ5 ఒరిజినల్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్ – నోటరీ పరశురామ్ చాప్టర్ 1' ట్రైలర్ ఆకట్టుకునే కోర్ట్రూమ్ థ్రిల్లర్గా…