స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ మహిళా ప్రాధాన్య చిత్రం సమంత కెరీర్లో మరో విజయంగా నిలిచింది.
ఈ సినిమా విజయంతో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తుండగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా స్పందించారు. చిత్ర యూనిట్ను అభినందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
చిరంజీవి మాట్లాడుతూ, సమంత లాంటి స్టార్ హీరోయిన్ యాక్షన్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం విశేషమని కొనియాడారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి వైవిధ్యభరితమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, క్రియేటర్ మరియు నిర్మాత రాజ్ నిడిమోరు సహా మొత్తం చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం చిరంజీవి చేసిన మరో వ్యాఖ్య. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సమంత-రాజ్లకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల సమంత బేబీ బంప్తో కనిపించారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో, ఆమె గర్భవతి అనే ప్రచారం జోరందుకుంది. అలాగే సమంత-రాజ్ నిడిమోరు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు సమంత లేదా రాజ్ నిడిమోరు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చిరంజీవి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది.
మరోవైపు, ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత మరోసారి తన స్టార్డమ్ను నిరూపించుకోగా, సినిమా విజయోత్సాహంలో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. దర్శకుడు మేర్లపాక…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 (#చిరు158)…
ప్రముఖ నటి కలర్స్ స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను స్వాతి తన…
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ' చిత్రానికి…
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గ్రామీణ కుటుంబ వినోదభరిత చిత్రం 'ఓ.!…
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్తో…